Friday, November 03, 2006

సందీప్

కావలసినవి::

1/2..... గ్లాసు పుల్లటి పెరుగు
1....... గ్లాసు మైదాపిండి
2....... గ్లాసుల నెయ్యి
2....... గ్లాసుల పంచదార


చేసే విధానము::

పుల్లటి పెరుగు మైదాపిండి లో పోసి పూరీ పిండిలా చేయాలి.( నీళ్ళు తగలకూడదు )

ఎంత నెయ్యి పడితే అంతా వేసి ముద్దలా చేయాలి .

1 గంట నానబెట్టి బాగా మర్ధించి దళసరి చపాతీలు వత్తాలి.

చపాతి వత్తగానే పైన నెయ్యి రాసి మడిచి మళ్ళా వత్తాలి అలా 4 5 సార్లు వత్తాక

చపాతి మీద గుండ్రని మూత లాంటి దానితో అదిమి బిళ్ళలుగా కట్ చేయాలి.

నెయ్యి కాచిఒక్కో బిళ్ళనీ గోల్డు కలర్ వచ్చెలా వేయించి తీసి ఓ పెద్ద పళ్ళెం లో పెట్టాలి.

చక్కర లో నీళ్ళు పోసి ముదరుపాకం పట్టి ఆ పాకాన్నిఒక్కో బిళ్ళమీద చెంచాతో వెయ్యాలి.

అరగంట ఆరిన తర్వాత పాకం పొరల్లోకి పోయి యమ రుచిగా ఉంటాయి...మీరు రెడినా...

సజ్జ బూరెలు


కావలసినవి::

మైదా................250 గ్రా
బోంబాయ్ రవ..........1 కప్పు
నీళ్ళు...............2 కప్పులు
పంచదార............1 కప్పు
డాల్డా..............50 గ్రా
ఇలాచీలు............3
జీడిపప్పు...........20 గ్రా
పచ్చ కర్పూరం చిటికెడు.......
నూనె..............1/4 కిలో

చేసే విధానం::

మూకుడు లో డాల్డా వేసి వేడి చేసి .. బొంబాయ్ రవ దోరగా వేయించి...

వేరే మూకుడులో నీళ్ళు రెండుకప్పులు వేడిచేసి మరిగిన తరువాత రవ వేసి ఉడికించి..మిగిలిన డాల్డాకూడ వేసి

కలుపుతూ ఉండకట్టకుండతిప్పుతూ ఉండాలి. చక్కర, ఇలాచి, వేయించిన జీడిపప్పు, కర్పూరం, వేసి

మళ్ళీ కలిపి ముద్ద అయ్యేంత వరకు ఉడికించి నెయ్యిపైకి తేలిన తరువాత..ఒక డిష్ లో పెట్టవలెను.

మైదాపిండిలో చిటికెడు ఉప్పు కలిపి ఒక బేసిన్లోకి తీసి తగినన్ని నీళ్ళుపోసి పిండి తడిపిపెట్టండి.

తడిపిన పిండిని ఒక గంట నానబెట్టి..డాల్డా..లేక నూనె..వేసి పూరి ఉండలాగ చేసుకొని పీటపై వత్తి..

దానిలో నిమ్మకాయంత చేసిన హల్వా పెట్టిమూసి గుండ్రంగా చేతితో వత్తి..పూరీల మదిరిగా చేసుకొని

కాగిన నూనెలో దోరగా వేయించి తీసి పళ్ళెన్లో పెట్టి 5 నిముషాల తరువాత సర్చేయండి..ఆహా ఏమిరుచీ

మరి మీరూ Try చేస్తారా......