Wednesday, April 29, 2009

మినప పొట్టుతో వడియాలు--(Urad Pappad)


!! కావలసినవి !!

మినపప్పు -- 1 కప్పు

మినప పొట్టు -- 3 కప్పులు

జీర -- 1/2 టేబల్‌స్పూన్

ఇంగువ -- 1/4 టీ స్పూన్

పచ్చిమిర్చి -- 12
ఉప్పు తగినంత



!! తయారుచేసే విధానము !!

ముందుగా మినపప్పుని మెత్తగా రుబ్బాలి.

తరవాత మినప పొట్టు,ఉప్పు,పచ్చిమిర్చి,జిలకర్ర,ఇంగువ వేసి కొద్దిగా నీళ్లు పోసి (బరకగా)రుబ్బాలి.

మినప వడియాల మాదిరిగానే ప్లాస్టిక్ కవర్‌మీద సరిపడా సైజులో పెట్టుకోవాలి.

నూనెలో వేయించి తీస్తే మాంచి వాసనతో ఘుమఘుమలాడుతూ వుంటాయి.

కరకరలాడే వీటిని వేడి వేడి అన్నంలో నేతిలో కలుపుకుని తింటే చాలా బాగుంటాయి.

మరి మీరూ చేసి రుచి చూస్తారా ? ....
ఈ ఐటం విజయవాడ..వైజాగ్ వారికి ఇష్టమైన వంటకం :)


~*~ స్పెషల్ వడ ~*~

!! కావలసినవి !!

కందిపప్పు (Bengal gram dal) -- 1/2 కప్

మినపప్పు (Tuar dal) -- 1/2 కప్

జీర -- 1/2 టేబల్‌స్పూన్

డ్రైచిల్లీ -- 6

ఉల్లిపాయలు -- (onions) -- 1/2 కప్

కరేపాక్ 20 ఆకులు

ఉప్పు రుచికి తగినంత

నూనే -- (Oil) -- వేయించేందుకు తగినంత


!! చేసే విధానము !!

ముందు కందిపప్పు,మినపప్పు, రెండు నీళ్ళ ల్లో 6 గంటలు నానబెట్టాలి.

తరువాత నానిన వాటిలో ఎండు మెరపకాయలు,జిలకర్ర,ఉప్పు,

వేసి బరకగా రుబ్బుకోవాలి. (గ్రైండ్ )చేసుకోవాలి.

రుబ్బిన పిండిలో ఉల్లిపాయలు,కరేపాకు సన్నగా తరిగి

అందులో కలిపి రౌడుగా చేతిమీద కాని,ప్లాష్టిక్ షీట్ పై కాని

వడమాదిరిగా తట్టి,నూనేలో deep fry చేయాలి.

వేడి వేడి వడలపై కొబ్బర చెట్ని కాని,టోమాటో సాస్ తో కాని

తింటే చాలా కమ్మగా ఘుమ ఘుమ గా వుంటాయి.

మరి మీకు నచ్చితే chat చేసినా,లేక మెస్సేజి ఇచ్చినా

సంతోషమే....మరి మీ జవాబుకై...ఎదురు చూస్తూ....

మీ కోసం...మీ...శక్తి :)

కొబ్బరి మామిడి పలావు


30 నిముషాలలో తయారయ్యే ఈ పలావు
పార్టీలకు స్పెషల్‌గా వడ్డించవచ్చు
.

!! కావలసినవి !!

బాస్మతి రైస్ -- 1 కిలో

పచ్చి మామిడి ముక్కలు --200 గ్రా

కొబ్బెరి పాలు -- 200 ఎం ఎల్

ఉల్లిపాయలు -- 2

దాల్చిన చెక్క -- 5

యాలకులు -- 5 గ్రా

మిరియాలు -- 5 గ్రా

పసుపు -- చిటికెడు

జిలకర్ర -- 10 గ్రా

అల్లం,వెల్లుల్లి, పేష్ట్ -- 1 టీ స్పూన్

ఆయిల్ లేదా నెయ్యీ -- తగినంత


!! తయారు చేసే విధానం !!

బాస్మతి బియ్యాన్ని అరగంటసేపు నానబెట్టాలి.

ఒక పాత్రలో నెయ్యివేసి,చెక్క,యాలకులు,జిలకర్ర,మిరియాలు వేసి,

వేయించిన తరువాత ఉల్లిపాయ ముక్కలు,వేయించుకోవాలి.

అల్లం వెల్లుల్లి పేష్ట్ కూడ కలిపి వేయించి,

నానబెట్టిన బియ్యం కలిపి గట్టిగా మూతపెట్టి,

సన్నటి సెగమీద ఉడక నివ్వాలి. 20 నిముషాలపాటు ఉడకనీయండి.

మూత తీయకూడదు సుమా. ఆ తరువాత గరిటతో జాగ్రత్తగా కలిపి

అందులో కొబ్బెరపాలు,పసుపు,మామిడి ముక్కలు వేసి కలిపి

ఒక 6 నిముషాలు ష్టవ్ పై అలాగే వుంచి తర్వాత తీయండి.

ఘుమ ఘుమ లాడే కొబ్బరి మామిడి పలావ్ తయార్ :)