Tuesday, October 16, 2007

మహిషాసుర మర్ధిని ( ప్రసాదం )..8th Day prasaadam

8వ రోజు ప్రసాదం

!! బెల్లం అన్నం !!

!! కావలసినవి !!

బియ్యం..............100 gm
బెల్లం................150 gm
యాలకులు..........5
నెయ్యి................50 gm
జీడిపప్పు............10

చేసే విధానం::

బియ్యం కడిగి అరగంట నాననివ్వండి .
తరువాత మెత్తగా వుడికించాలి .

అందులో
దంచిన బెల్లం వేసి
మొత్తం కరిగెంత వరకు వుడికించాలి .

జీడిపప్పులు నేతిలో దోరగా వేయించి ,
యాలకుల పొడి మిగితా నెయ్యి మొత్తం అన్నంలో కలిపి
దించేయడమే .

తియ్యటి తీపితో ఆ తల్లి శాతించి మీ కోరికలన్నీ తీరుస్తుంది :)
ఇది సత్యం

దుర్గాష్టమి ( ప్రసాదం ( కదంబం )7th Day

7th Day prasaadam

!! కదంబం !!

!! కావలసినవి !!

1/2 కప్...కందిపప్పు
1/2 కప్ బియ్యం..( కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది )
1...వంకాయ
1/4....సొర్రకాయ
1....దోసకాయ
బీన్స్ తగినన్ని
1.....పోటాటో
2 పిడికిళ్ళు..వేరుశెనక్కాయలు ( పీనట్ )
2..బేబీ కార్న్
1/2...క్యారెట్
2...టోమాటో
2..కరేపాక్ రెబ్బలు
1tsp..కోత్తమీర తురులు
1 చిప్ప..కోరిన పచ్చి కొబ్బెర
4...గ్రీన్ చిల్లిస్
నూనె తగినంత
నెయ్యి చిన్న కప్పు
చింతపండు గొజ్జు తగినంత
కాస్త బెల్లం ( జాగిరి )
ఉప్పు , పసుపు తగినంత
3..చెంచాలు సాంబర్ పౌడర్
పోపు గింజలు ,ఎండుమిర్చి, ఇంగువ .

చేయవలసిన విధానము ::

ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కోని వుంచుకోండి
కుక్కర్ లో కందిపప్పు ,బియ్యం ,పీనట్ ,టోమాటో తప్ప అన్నీ కూరగాయలు వేసి
పసుపు , ఉప్పు ,నీళ్ళు 5 పావులు వేసి రెండు విజిల్ వచ్చాక stove off చేయండి .
మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి చేసాక అందులో కొద్దిగ ఆవాలు వేసి అవి చిట్లిన తరువాత
పచ్చిమిర్చి ,కరేపాకు ,టొమాటో ,చింతపండు గొజ్జు ,సాంబర్ పౌడర్ , జాగిరి .వేసి
బాగా వుడికిన తరువత ఆ గ్రేవి అంతా వుడికిన రైస్ లో వేసి,కోత్తమీర ,కరేపాక్ ,నెయ్యి వేసి
మరోసారి వుడికించండి అంతా బాగా వుడికిన తరువాత ,ఎండు మిర్చి ,ఇంగువతో తాలింపు పెట్టి
కొబ్బెర వేసి కలిపి దించండి వేడి వేడిగా దుర్గాదేవికి నెయ్యివేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి :)


శ్రీ మహాలక్ష్మిదేవి( ప్రసాదం ( రవ కేసరి ) 6th Day

6th Day prasaadam

!! రవ కేసరి !!

!! కావలసినవి !!

రవ 1 కప్
షుఘర్ 3/4 కప్
గీ 2 టెబల్ స్పూన్
కేసరి కలర్ Tel Saffron టెల్ ఒక పించ్
యాలకులు 4
డ్రై ద్రాక్షా 6
జీడిపప్పు 10
మిల్క్ 1 కప్ ( మిల్క్ మేడ్ 1 )
వాటర్ 1/2 కప్

!!! చేసే విధానం !!!

ముందు మూకుడులో కాస్త గీ వేసి రవ దోరగా వేయించి తీసి ప్లేట్ లో వేసి వుంచండి .
అదే మూకుడులో కాస్త గీ వేసి జీడిపప్పు , ద్రాక్ష వేయించి తీసి వుంచండి .
నీళ్ళూ ,పాలూ ,కలిపి బాగా బాయిల్ చేసి అందులో
కేసరి కలర్ ,చెక్కర , రవ ,వేసి వుంటలు రాకుండగా గీ వేస్తూ బాగా కలిపి
అందులో ద్రాక్షా , జీడిపప్పు ,మిగిలిన గీ అంతా వేసి బాగా కలిపి
వేడి వేడి గా ఘుమ ఘుమగా నేతితో ఆ మహాలక్ష్మికి ఆరగింపు పెట్టి
భోగ భాగ్యాలతో పాటు సౌభాగ్యం కూడా ఇవ్వమని ప్రాథించి నైవేద్యం పెట్టండి
మీ కోరికలన్నీ నెరవేరినట్టే :) ఆ చల్లని తల్లి దీవెనల కన్నా మనకు కావలసినది ఏమి ?

సరస్వతి పూజ ( ప్రసాదం పెరుగన్నం , దద్ధోజనం ) 5th Day


5th Day prasaadam

!! పెరుగన్నం !!

బియ్యం 1/4 కిలో
పాలు 1/2 లీ
చిక్కటి పెరుగు 1/2 లీ
నూనె 1/2 కప్పు
నెయ్యి 1 స్పూన్
కొత్తమిర , కరేపాక్
చిన్న అల్లం ముక్క
పచ్చిమిర్చి
పోపు సామాగ్రి
జీడిపప్పు 20
ఉప్పు , ఇంగువ ఎండుమిర్చి

!! చేసే విధానం !!

ముందు బియ్యం కడిగి అన్నం వండి , కాస్త చల్లారాక
కాచినపాలు , పెరుగు , ఉప్పు , వేసి బాగా కలిపి వుంచండి
సన్నగా తరిగిన చిల్లి , కొత్తమిర ,కోరిన అల్లం ,అన్నీరెడ్డిగ్గా వుంచుకొని
ష్టవ్ పై మూకుడుంచి అందులో నునె వేసి పోపు కావలసినవన్నీ వేసి
ఎండుమిర్చి ఇంగువ తో పాటు తరిగి వుంచిన వన్నీ వేసి బాగా వేగనిచ్చి పెరుగులో కలిపి
కాస్త నేతిలో జీడిపప్పులు వేయించి అవీ వేయండి
రుచికరమైన దద్ధోజనం అంటే ఆ చదువుల తల్లికి అంత మక్కువ
ఎందుకో తింటే మీకే తెలుస్తుంది ఆ తల్లి దీవెనలతో అందరూ బాగా చదివి అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుతూ :)