Saturday, June 02, 2007

అల్లం పచ్చడి

కావలసినవి::

శనగపప్పు.............2 టేబల్‌స్పూన్స్
మినపప్పు.............2 టేబల్‌స్పూన్స్
ధనియాలు.............1 టేబల్‌స్పూన్
జీలకర్ర................1 టేబల్‌స్పూన్
చింతపండు - చిన్న నిమ్మకాయంత
అల్లం.................3 ఇంచ్ పిఎచె
ఉప్పు తగినంత
పచ్చిమిర్చి..........10
బెల్లం................చిన్న నిమ్మకాయంత
నునె................3 టేబల్‌స్పూన్స్

చేసే విధానం::

మూకుడు లో నునె వేసి అందులో శనగపప్పు..మినపప్పు
దనియాలు..జీలకర్ర..పచ్చిమిర్చి వేసి వేయించాలి.

ఇప్పుడు అల్లం వేసి కొంచెం వేయించి పెట్టుకోండి.

అల్లం వేయించిన సామాగ్రి అంతా చల్లరబెట్టి
అందులో చింతపండు..ఉప్పు..బెల్లం వేసి
అందులొ కొంచెం నిళ్ళూ వేసి మెత్తగా గ్రైండ్ చేయండి.

ఘుమ ఘుమ లాడే అల్లం పచ్చడి రెడి
ఒంటికి ఈ పచ్చడి చాలా మంచిది...

వెజిటబుల్ సమోసా



కావలసినవి ::--

సమోసా తయారి ::-
మైదా --------------------- 1 cup
నెయ్యి --------------------- 1/2 cup
బేకింగ్ పౌడర్ --------------- 1/4 tbl spoon
ఉప్పు - తగినంత
నీళ్ళు

కూర తయారికి ::--
బంగాలదుంపలు - 3( వుడికించిన బంగాలదుంపల్ని పొట్టు తిసేసి దానిని చేతితో చిదిపెయ్యాలి).
ఉలిపాయాలు - 1 ( ముక్కలు)
పచ్చి బఠానీలు ------------------------1 cup
పచ్చిమిరపకాయలు --------------------2
కొత్తిమెర చాప్ చేసింది------------------- 1 టేబల్ స్పూన్
నిమ్మ జూసు ---------------------------- 2 tbl spoon
పసుపు -------------------------------- 1/2 tbl spoon
గరం మసాల ---------------------------- 1/2 tbl spoon
కారం ----------------------------------- 1 tbl spoon
ఆవాలు --------------------------------- 2 tbl spoons
అల్లం వెల్లుల్లి పేస్టు----------------------- - 1 tbl spoon
ఉప్పు - తగినంత
నునె - వేయించడానికి
కరివేపాకు -------------------------------- 2 రెబ్బలు

తయారు చేసే విధానం ::--

మైదా లో ఉప్పు,బేకింగ్ పౌడర్, నెయ్యి వేసి కలుపుకోవాలి.
కొంచెం నీళ్ళు పోసి చాలా మెత్తగా కలుపుకోవాలి.
కలిపిన పిండి ని 30 నిమషాలు పాటు తడిబట్టతో పెట్టి వుంచాలి.

కూర విధానం ::--

ఒక పాన్ లో నునె వేసి వేడి చెయ్యాలి.
అందులో ఆవాలు, కరివేపాకు ,వేసి వేయించాలి.
అందులో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి.
ఇప్పుడు పచ్చిబఠానిలు,అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాల,కొత్తిమెర,కారం, పసుపు, ఉప్పు వేసి వేయించాలి.
కొంచెం వేయించాక అందులో బంగాలదుంపను వేసి వేయించాలి.
అందులో నిమ్మ జూసు వేసి కలుపుకోవాలి.
కలిపేసి పెట్టుకున్న మైదా ని మళ్ళీ బాగా కలుపుకోవాలి.
చపాతీ పిండిని నిమ్మకాయ సైజులో తీసుకునిచపాతీలా చేసి
వాటిని సగానికి కట్ చేసి సగభాగాల మధ్యలో కూర మిశ్రమాన్ని పెట్టి త్రికోణపు ఆకారంలో మడవాలి.
అంచులు గట్టిగ వత్తలి. వాటిని కాగిన నూనెలో ఎర్రగా వేయించాలి.
సమొసా నీ టొమటో సాస్ తో తింటే బాగుంటుంది.
ఆలస్యం దేనికీ ? మీరూ సమోసా చేసేందుకు తయార్ కాండి :)