Sunday, November 05, 2006

సేమ్యా బోండా

కావలసినవి !!!!

సేమ్యా 1/4 కేజి ,
క్యాబేజీ 100 కేజి ,
క్యారట్ 50 గ్రాం ,
మంచినూనె 1/4 కేజి ,
నెయ్యి లేదా డాల్డా 50 గ్రాం ,
శనగపిండి 1 కప్పు ,
బియ్యం పిండి 1 కప్పు ,
ఉల్లిపాయలు 1 ,
పచ్చిమిర్చి 4 ,
అల్లం అంగుళం ముక్క ,
కారం 1 టీ స్పూన్ ,
ఉప్పు తగినంత ,
పసుపు 1/2 టీ స్పూన్ ,
వంట సోడా చిటికెడు ,
కరివేపాకు ఒక రెబ్బ ,
ఆవాలు 1/4 టీ స్పూన్ ,
జీలకర్ర 1/4 టీ స్పూ
న్జీడిపప్పు 8 .

చేసే విధానం !!!!

ముందుగా సేమ్యాను నేతిలో కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పుగిన్నెలో 4 స్పూనుల నూనె వేసి వేడి చెసి ఆవాలు,జీలకర్ర,కరివేపాకు,వేసి ఆతర్వాత తరిగిపెట్టుకున్న ఉల్లి,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇవన్నీవేగాక తరిగిన క్యాబేజీ,తురిమిన క్యారట్, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి.కొద్దిగా మగ్గిన తర్వాత రెండు గ్లాసుల నీళ్ళు పోసి మరిగించాలి.నీళ్ళు మరుగుతుండగావేయించిన సేమ్యాను వేసి ఉండలు కట్టకుండా దగ్గరకు వచ్చేవరకు కలుపుతూఉండాలి. దింపేముందు జీడిపప్పు,సన్నగా తరిగిన కొత్తిమిర వేసి కలపాలి.శనగపిండి,బియ్యంపిండి మిశ్రమంలో తగింత ఉప్పు,కారం పొడి, వంటసోడా నీళ్ళుపోసి బజ్జీల పిండిలా కలపాలి.పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి వేడి చేయాలి.సేమ్యా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసిపిండిలో ముంచి నూనెలో వేసిఎర్రగా వచ్చేలా వేయించి తీయాలి. ఇవి వేడి మీద తింటే చాలా బావుంటాయి

బియ్యపు చెక్కలు + నిప్పట్లు
















కావలసినవి::

బియ్యపు పిండి..... 1/2 కేజి
జీలకర్ర............. 1/2 స్పూను
కారం పొడి......... 1/2 స్పూను
వేరుశనక్కాయలు......1 చిన్న గ్లాసు
నువ్వులు...........2 టేబల్ స్పూన్స్
ఉప్పు తగినంత..............
కరిగించిన నెయ్యి లేదాడాల్డ....50 గ్రాం
.

చేసేవిధానము::

ముందుగా పిండిలో ఉప్పు,కారం పొడి( ఎండుమెరపకాయలు ఇంట్లో గ్రైండర్ లో తిప్పితే బాగుంటుంది ) , జీలకర్ర,కరిగించిననెయ్యి,వేరుశనక్కాయలు(పల్లీలు) గ్రైండర్లో ఒక్కతిప్పు తిప్పి అదికూడపిండిలో వేసి బాగా కలిపి ఒక గ్లాసు మరిగించిన నీరు పోసిమొత్తం బాగ కలిపి మూత పెట్టి ఉంచాలి. తర్వాత పిండిని బాగ కలిపి చిన్న చిన్నఉండలుగా చేసుకొని పాలిథిన్ కవరుపై నూనె రాసి పల్చగా వత్తి వేడి వేడి నూనెలోఎర్రగా వేయించిబంగారు రంగు వచ్చేవరకు వేయించి తేసి ప్లేటులో ఉంచండి.
చల్లారాక టైట్ గా ఉన్న డబ్బాలో వేసి ఉంచండి.ఇవి చాల రోజులు నిలవ ఉంటాయి...ఈ రెసిపి మీకు నచ్చింటే ఒక్క కామెంట్....ఆహా...ఏమిరుచీ.....

తీపి గవ్వలు


కావలసినవి::

మైదా.....................250 గ్రాం
నెయ్యి లేదా డాల్డా...50 గ్రాం
ఉప్పు చిటికెడు...........
నూనె.....................250 గ్రాం
చక్కెర....................250గ్రాం
యాలకులు............5

చేయవలసిన విధానం::

ముందుగా చక్కెరలో సగం గ్లాసు నీళ్ళు పోసి తీగ పాకంలా చేసి అందులో యాలకుల పొడికలిపి పెట్టుకోవాలి.
మైదాపిండిలో కాచిన నెయ్యి కొద్దిగా ఉప్పు వేసి కలిపి చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి.

గవ్వల పీటకు నూనె రాసి పెట్టుకోండి.

మైదాపిండిని రెండుచేతులతో బాగా మర్ధన చేసి చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు ఈ మైదా ముద్దను గవ్వల పీటపై బొటనవేలితో వత్తుతూసాగదీయాలి.

దానిని మెల్లిగా చుట్టెస్తే గవ్వలా ఉంటుంది.అలా అన్ని గవ్వలా చేసిపెట్టుకుని వేడి నూనెలో నెమ్మదిగా వేయించాలి.

గవ్వలు వేడిమీద ఉండగానే పాకంలోవేయాలి.

పాకం పీల్చుకున్న తర్వాత తీసి విడివిడిగా ఆరబెట్టి డబ్బాలో వేసిపెట్టుకోవాలి.మరి మీకు నచ్చితే నాకో....తెలుసుకదా :)

బ్రెడ్ మంచూరియా



కావలసినవి::

బ్రెడ్........................6 స్లైసులు
మైదా.....................1/2 కప్పు
కార్న్ ఫ్లోర్................1 టేబల్ స్పూన్
అల్లం వెల్లుల్లి ముద్ద......2 టీస్పూన్స్
మిరియాల పొడి.........1 టీస్ పూన్స్
కారం పొడి..............1/2 టీస్ పూన్స్
ఉప్పు తగినంత.......................
సోయా సాస్............1/2 టీ స్పూన్స్
అజినొమొటో చిటికెడు....................
పచ్చిమిర్చి............1
ఉల్లి పొరక............1/4 కప్పు

చేసే విధానం::

బ్రెడ్ అంచులు తీసేయాలి. ఒక్కో స్లైసును నాలుగు ముక్కలుగా చేసి పెట్టుకోండి.

ఇప్పుడు మైదా,కార్న్ ఫ్లోర్,ఉప్పు,సగం అల్లం వెల్లుల్లి ముద్ద,కారం పొడి కలిపి
కొద్దిగా నీళ్ళు పోసి బజ్జీల పిండిలా కలిపి పెట్టాలి.

ఈ మిశ్రమం మరీ చిక్కగా కాకుండా,మరీ పలుచగా కాకుండా ఉండాలి.

పొయ్యి మీద నూనె వేడి చేసి ఈ బ్రెడ్ ముక్కలను పిండిలో ముంచి నూనెలో వేసి ఎర్రగా వేయించాలి.

అలా అన్ని ముక్కలు ఎర్రగా చేసి పక్కన పెట్టుకోండి.

తర్వాత ఒక బాణలిలో రెండు స్పూనుల నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి ముద్ద కొద్దిగా వేపి సన్నగా తరిగిన ఉల్లిపాయలు
పచ్చిమిర్చి ముక్కలు, వేసి బాగా వేయించాలి.

ఇప్పుడు అర కప్పు నీళ్ళలో 1 స్పూను కార్న్ ఫ్లోర్,అజినొమొటొ,సొయా సాస్,మిరియాల పొడి వేసి కలిపి పోపులో వేసి
మరిగించాలి.

ఇప్పుడు బ్రెడ్ ముక్కలు వేసి ఓ నిమిషం ఉడికించి దించేయండి.

ఈ ఐటం పొడి పొడిగా కావాలనుకుంటే కారంఫ్లోర్ మిశ్రమం వేయకూడదు.
అజినొమొటొ, సొయాసాస్,మిరియాల పొడి వేసి బాగ వేయించి బ్రెడ్ ముక్కలు వేసి
కలిపి ఓ నిమిషం తర్వాత దించేయాలి...

వేడి వేడిగా సర్ చేసారంటే ఆ..హా..ఏమిరుచీ...మీకు నచ్చితే నాకో కామెంట్..రాయండి

బ్రెడ్ ఉప్మా


కావలసినవి::

బ్రెడ్.........................8 స్లైసులు
ఉల్లిపాయలు............1
టొమాటో................2
పచ్చిమిర్చి.............3
ఆవాలు.................1/4 టీస్పూన్
జీలకర్ర..................1/4 టీస్పూన్
మినప్పప్పు..........1/4 తీస్పూన్
కరివేపాకు.............1 టీస్పూన్
పసుపు..............--1/4 టీస్పూన్
ఉప్పు తగినంత..................
నూనె...................2 టీస్పూన్స్


చేసే విధానం::

బ్రెడ్ ను చిన్న చదరపు ముక్కలుగ చేసి పెట్టుకోవాలి.కావాలంటె
ఈ ముక్కలను నూనెలో కాని టోస్టర్లో కాని ఎర్రగా కాల్చి పెట్టుకోవచ్చు.

ఆనియన్,పచ్చిమిర్చి సన్నగా తరిగి ఉంచుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె వేడి చేసి
ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు,కరివేపాకు వేసి కొద్దిగా వేపి తరిగిన ఆనియన్
పచ్చిమిర్చి,పసుపు వేసి వేయించాలి.

ఇప్పుడు బ్రెడ్ ముక్కలు తగినంత ఉప్పు వేసి అన్ని
బాగా కలిపి మూత పెట్టాలి.ఓ మూడు నిమిషాల తర్వాత కొత్తిమిర చల్లి దించేయండి.
ఇది చాల తొందరగా అయ్యే టిఫిన్.....మీరూ Try చేసి చూడండి..:)