Wednesday, August 22, 2007

జాంగ్రీ

!!! కావలసినవి !!!

మినప్పప్పు 250 gm
బియ్యం గుప్పెడు
పంచదార 1/2 kg
మిఠాయిరంగు చిటికెడు
నెయ్యి లేక నూనె వేయించడానికి

!!! చేసే విధానం !!!

మినప్పప్పును శుభ్రం చేసి బియ్యం కలిపి నీళ్ళు పోసి 4 గంటలు నాననివ్వాలి.
తర్వాత ఈ పప్పును కాటుకలాగా మెత్తగా రుబ్బుకోవాలి.
పంచదారలో కప్పుడు నీళ్ళు పోసి జిగురుపాకం చేసి మిఠాయిరంగు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఒక మందపాటి గుడ్డకు రంధ్రం చేసి ,అంచులు కుట్టి, అందులో ఈ పిండి వేసి నాలుగుమూలలు కలిపి
మూటలాగా పట్టుకుని వేడి నూనెలో చుట్టలుగా వత్తుకోవాలి.
ఎర్రగా కాలినతర్వాత తీసి పాకంలో వేయాలి.
అలా అన్ని చేసుకుని రెండుగంటలు పాకంలో నాననిస్తే, జాంగ్రీలు గుల్ల విచ్చి పాకం బాగా
పీలుచుకుని మృదువుగా ఉంటాయి.
జాంగ్రీ ,లేదా జిలేబీలు ,చేయడానికి ప్లాస్టిక్ బాటిల్ వంటిది దొరుకుతాయి.
అవి కూడా ఉపయోగించుకోవచ్చు...మీరూ....రెడినా ? :)
shadruchulu.blogspot.com ....సేకరించినది
!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!

No comments: