Tuesday, October 16, 2007

దుర్గాష్టమి ( ప్రసాదం ( కదంబం )7th Day

7th Day prasaadam

!! కదంబం !!

!! కావలసినవి !!

1/2 కప్...కందిపప్పు
1/2 కప్ బియ్యం..( కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది )
1...వంకాయ
1/4....సొర్రకాయ
1....దోసకాయ
బీన్స్ తగినన్ని
1.....పోటాటో
2 పిడికిళ్ళు..వేరుశెనక్కాయలు ( పీనట్ )
2..బేబీ కార్న్
1/2...క్యారెట్
2...టోమాటో
2..కరేపాక్ రెబ్బలు
1tsp..కోత్తమీర తురులు
1 చిప్ప..కోరిన పచ్చి కొబ్బెర
4...గ్రీన్ చిల్లిస్
నూనె తగినంత
నెయ్యి చిన్న కప్పు
చింతపండు గొజ్జు తగినంత
కాస్త బెల్లం ( జాగిరి )
ఉప్పు , పసుపు తగినంత
3..చెంచాలు సాంబర్ పౌడర్
పోపు గింజలు ,ఎండుమిర్చి, ఇంగువ .

చేయవలసిన విధానము ::

ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కోని వుంచుకోండి
కుక్కర్ లో కందిపప్పు ,బియ్యం ,పీనట్ ,టోమాటో తప్ప అన్నీ కూరగాయలు వేసి
పసుపు , ఉప్పు ,నీళ్ళు 5 పావులు వేసి రెండు విజిల్ వచ్చాక stove off చేయండి .
మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి చేసాక అందులో కొద్దిగ ఆవాలు వేసి అవి చిట్లిన తరువాత
పచ్చిమిర్చి ,కరేపాకు ,టొమాటో ,చింతపండు గొజ్జు ,సాంబర్ పౌడర్ , జాగిరి .వేసి
బాగా వుడికిన తరువత ఆ గ్రేవి అంతా వుడికిన రైస్ లో వేసి,కోత్తమీర ,కరేపాక్ ,నెయ్యి వేసి
మరోసారి వుడికించండి అంతా బాగా వుడికిన తరువాత ,ఎండు మిర్చి ,ఇంగువతో తాలింపు పెట్టి
కొబ్బెర వేసి కలిపి దించండి వేడి వేడిగా దుర్గాదేవికి నెయ్యివేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి :)


No comments: