Sunday, May 31, 2009

!! మీకు తెలుసా ??? !! చిట్కాలు



పూరీలు బాగా క్రిస్పీగా ఉండాలంటే,పూరీ పిండికి బాగా మరిగించిన ఆయిల్ కలపాలి

లేకపోతే ఈస్ట్ పోడి 1/4 టీ స్పూన్ గోరువెచ్చని నీటిలో

ఈస్ట్ కలిపి పూరీ పిండిలో వెసి కలిపితే చాలా బాగా పూరీలు వస్తాయి

చల్లటి పాలువేసి కలిపినా పూరీలు క్రిస్పీగా వస్తాయి


ఇడ్లీ పిండిలో చెంచా నువ్వుల నూనె వేస్తే ఇడ్లీలు తెల్లగా మృదువుగా వస్తాయి

కాకరకాయ కూర వండేటప్పుడు వీలైతే అందులో రెండు పచ్చి మామిడి కాయ ముక్కలు వేయండి.

చేదు తగ్గడమే కాదు, కూరకు కొత్త రుచి వస్తుంది


గులాబ్ జాం తాయారు చేసేందుకు పిండి కలిపేటప్పుడు పిండిలో కాస్త పన్నీరు కలపండి. అవి


మృదువుగా రుచిగా ఉంటాయి. చల్లటి పాలు కలిపినా మౄదువుగా కాకుండగా విరక్కుండగ వస్తాయి.

చపాతీ పిండిని పాలు లేదా గోరువెచ్చని నీళ్ళు లేదా కాస్త నూనె కలిపి గంటపాటు నానబెడితే చపాతీలు మృదువుగా వస్తాయి.

సలాడ్ కోసం పళ్ళు ముందుగానే కోసి పెట్టుకున్నా అవి నల్లగా మారకుండా ఉండాలంటే,

వాటి మీద నిమ్మకాయ రసం లేకపోతే తేనే వేసినా పళ్ళు నల్లగా మారవు


ఫ్రైడ్ రైస్ చేసేప్పుడు నీళ్లు బదులుగా పాలు వాడితే అన్నం రుచిగా ఉంటుంది.

No comments: