Thursday, September 13, 2007

చిరోటి రవ కుడుములు



!! కావలసినవి !!

చిరోటి రవ 1/4 కేజి ( 1 గ్లాస్ )
మైదా పిండి 2 స్పూన్స్
కొద్దిగ ఉప్పు ( ఉప్పు మంగళకరానికి శ్రేష్టమంటారుగా పెద్దలు
అందుకే శాస్రానికి వేయాలంటే వేయాలి )
నూనె 2 స్పూన్స్
చిటికెడు సోడా

ఇదంతా కొద్దిగ నీళ్ళుపోసి పూరీ పిండిలా గట్టిగా కలిపి పెట్టుకోవాలి.
2 3 గంటలు నానిన తరువాత పూరీలుగా వత్తుకోవాలి

!! పూర్ణానికి కావలసినవి !!

శనగ పప్పు 1 గ్లాసు
బెల్లం 2 గ్లాసులు
వేయించేందుకు తగినంత నూనే
ఎండుకొబ్బెర 3 టేబల్ స్పూన్స్
గసగసాలు 1 1/2 స్పూన్స్
జీడిపప్పు ముక్కలు 3 టేబల్ స్పూన్స్

!! చేయవలసిన విధానం !!

శనగ పప్పు నీళ్ళు వేసి వుడికించి
ఆ నీళ్ళన్ని వంపేసి అందులో చితగొట్టిన
బెల్లం పొడిని వేసి
ఒక 2 నిముషాలు వుడక నిచ్చి
గ్రైండ్ చేయండి.అందులో కొబ్బెర,
గసగసాలు,నేతిలో వేయించిన
జీడి పప్పు వేసి బాగా కలపండి.
ఈ పూర్ణాన్ని ఒక ప్లేట్ లో తీసివుంచాలి.
పూరీలుగా వత్తుకొన్న వాటిపై
ఈ పూర్ణాన్ని పెట్టి చుట్టూ
గోటితో మడతలుగా మడచి
నూనేలో దోరగా వేయించడి
పళ్ళెంలో అందంగా పేర్చి,
వినాయుకుడి ముందు నేవెధ్యం పెట్టాలి .
తరువాత మీరారగించవచ్చు :) !!!

No comments: