Thursday, September 13, 2007

ఢిల్లీ బాదుషా






కావలసినవి::

మైదాపిండి.............1/2 కేజి
చక్కర..................1/2 కేజి
నీళ్ళు..................1/2 కప్పు
చిటికెడు సోడా
డాల్డా..................1/4 కప్పు
ఏలకుల పొడి..........1/2 స్పూన్
నూనే..................2 కప్పులు

చేసే విధానం::

మైదా పిండిలో సోడా,నెయ్యి,నీళ్ళు
వేసి 15 నిముషాలు బాగా కలపాలి.

పిండిని వడపిండిలా కలుపుకోవాలి
వాటిని వడలమాదిరిగా చేసుకొని
వేడి చేసిన నూనేలో వేయించండి.

అరకప్పు నీళ్ళలో 1/2 చక్కర వేసి
చక్కర కరిగెంతవరకు వుంచండి.

లైట్ గా తీగపాకం వచ్చెంతవరకు
పెడితే బాదుషాలపై చెక్కర నిలబడుతుంది
ఈ పాకంలో వేయించిన బాదూషాలు వేసి
15 నిముషాల తరువాత తీసి ప్లేట్ లో వుంచండి
కన్నులకు ఇంపుగా కనిపించే బాదూషాలు రెడీ..
...మీరూ Try చేసి చేయండి

No comments: