![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEghKXnAKG83KJTNU3lvf-nnds1tdCWD639bjadWwllTog5ALGggcvJBVbiEco7r_wyLhqg3c5rYjcWqFUox6zvdYsFJS8JdA8l38H6YI-DAVqyA5tu4wlnFW_ousgshtpysxR59BJIeVIk/s320/untitled.bmp)
మైద.... 1/2 కిలో ,
డాల్డా.... 100 గ్రా( కరిగించినది ) ,షోడా.... 1/4 టీ స్పూన్పె ,
పెరుగు....1 గరిటెడు ,
పంచదార.. 1/2 కిలో.
!!!!! చేసే విధానం !!!!!
మైదాలో కరిగించిన డాల్డా వేసి ఒక బేసిన్ లో షోడా వేసి ,పెరుగు కలిపి అందులోనే..ఈ మైదా..షోడా..పెరుగు..అన్నీ కలిపి
కొంచం నీళ్ళు చల్లి ముద్ద చేయండి .
దీన్ని చిన్న చిన్న గుండ్రంగా ఉండలుగా చేసుకొని , రెండు చేతుల మద్య నొక్కుతూ గుండ్రంగా తిప్పాలి ,
పొరలు పొరలుగా గుంటవున్న ఆకారంగా వస్తుంది .
ష్టవ్ సన్నని సెగలో పెట్టి డాల్డా వేడి చేసి అరగంటసేపు బాదుషాను వేయించి , తీగపాకంలో వేసి ఆరిన తరువాత సర్వ్ చేస్తే భలే రుచీగా వుంటాయి .
ఆహా ఏమిరుచీ అని మీరే అంతారు :)
!!!!!తీగ పాకం చేసేవిధానం !!!!!
ఒక గ్లాసు చక్కరకి , ఒక గ్లాసు నీళ్ళు, పెద్దదట్టమైన గిన్నెలో పంచదార , నీళ్ళు కలిపి ష్టవ్ పై వుంచి సన్నని సెగలో
పాకాన్ని అడుగంటకుండగా గరిటతో కలుపుతూ వుండాలి ,
గరిటతో పాకం నీళ్ళల్లో పోసి చూస్తే తీగలా పడాలి నీళ్ళు అంట కూడదు
అందులో బాదూషలు వేసి సర్వ్ చేయ్యాలి .ఇప్పుడు తెలుసుకొన్నారా తీగ పాకం ఎలాచేయాలో...నచితే ఒక్క మెస్సేజి ఇవ్వండీ