Wednesday, April 20, 2011

పెసరపప్పు మామిడికాయ పచ్చడి













కావలసినవి::

నానపెట్టిన పెసరపప్పు::: 4 టేబల్‌స్పూన్స్
పచ్చిమామిడికాయ కట్ చేసినవి:::1 కప్
ధనియ:::1/2 టేబల్‌స్పూన్
ఎండుమిర్చి:::6
వెల్లుల్లి రెబ్బలు :::2( ఇదికావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు)
ఉద్దిపప్పు:::1/2 టేబల్‌స్పూన్ (మినపప్పు)
ఆవాలు::::1/2 టేబల్‌స్పూన్ 
మెంతి గింజలు:::1/3 టీస్పూన్
కొత్తమీర:: ఒక కట్ట
నూనె:::సరిపడేంత
ఉప్పు,పసుపు:::రుచికి తగ్గత్లు 

తాళింపుకు కావలసినవి::

చనగపప్పు::: 1/2 టీస్పూన్ 
ఆవాలు::::::::: 1/2 టీస్పూన్ 
జిలకర::::::: 1/3 టీస్పూన్
ఉద్దిపప్పు:::::: 1/2 టీస్పూన్
ఎండుమిర్చి::::: 2
ఇంగువ రెండు చిటికెలు
కరివేపాకు:::: 2 రెబ్బలు
నూనె సరిపడినంత

చేసే విధానం:: 

ముందు ష్టవ్ పై పాన్ పెట్టి కాస్త నూనె వేసి వేడి అయిన తరువాత  
ధనియాలు,మెంతులు,ఉద్దుపప్పు,ఎండుమిర్చి ఆవాలు, వేయించుకొని
దోరగా వేయించాలి...వేయించిన వాటిని ఒక ప్లేట్ లోకి తీసి 
పక్కనుంచండి.

కొత్తమీర బాగా కడిగి సన్నగా తరిగి ఉంచుకోండి.

ఈ నానపెట్టి ఉంచిన పెసరపప్పు నీళ్ళు వడగట్టి ఉంచుకోండి.

అదే పాన్లో కాస్త నూనె వేసి మామిడికాయ ముక్కలు లైట్ గా వేయించి


ముందు వేయించిన ఉంచిన వాటిని ఈ మామిడికాయ ముక్కల్ని తరిగిన కొత్తమీర 

పెసరపప్పు, గ్రైండర్ లో మెత్తగా చేసుకొని ఒక గిన్నెలో తీసి ఉంచండి.

అదే పాన్లో ఒక స్పూన్ నూనె వేసి తాళింపు గింజలన్నీ వేసి ఇంగువ కరివేపాకు తోపాటు   
ఎండుమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించి చట్నిలో కలిపి వేడి వేడి అన్నంతో తినండి  
అధిరిపోయిందని మీరే చెపుతారు :) 

( వెల్లుల్లి పాయలు కావాలంటే ఇంగువ వేసే బదులు వెల్లుల్లి వేసి వేయించాలి ) 


మామిడికాయ ఆకు కూరల పచ్చడి














మామిడికాయ ఆకు కూరల పచ్చడి 

ఈ పచ్చడి 15 రోజులు నిలవవుంటుంది

కావలసినవి::

పచ్చి మామిడికాయ ముక్కలు::::::1 కప్పు
తోటకూర,పాలకూర,తరిగినది::::::::2 కప్పులు
పుదిన,కొత్తమీర :::::::::::::::::::::::1 కప్పు
పచ్చిమిర్చి ::::::::::::::::::::::::::::4
వెల్లుల్లి రెబ్బలు:::::::::::::::::::::::::4
పసుపు,ఉప్పు తగినంత

నూనె తగినంత

తాళింపుకు కావలసినవి:: 

ఆవాలు,జిలకర,చనగపప్పు,
మినపప్పు,ఎండుమిర్చి,కరివేపాకు అన్నీ పోపుకు తగినంత వేసుకోవాలి
రెండు వెల్లుల్లి రెబ్బలు పాయలుగా కట్ చేసి ఉంచండి.


పచ్చడి చేసే విధానం::

ష్టవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టి అందులో ఒక స్పూన్ నూనె వేసి
అందులో పచ్చిమిర్చి వేసి దోరగా వేపండి.

వేయించిన పచ్చిమిర్చి తీసి అందులోనే తోటకూర,పాలకూర,పుదిన,కొత్తమీర,
వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి.

ఇప్పుడు ఈ వేయించిన వన్నీ..గ్రైండర్లో వేసి అందులోనే మామిడికాయముక్కలు
రెండు వెల్లుల్లి రెబ్బలు,ఉప్పు పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి.

ఈ గ్రైండ్ చేసిన పచ్చడిలోకి 

పాన్ లో ఒక స్పూన్ నూనె వేసి..

ఆవాలు,జిలకర,ఉద్దిపప్పు,చనగపప్పు,ఎండుమిర్చి వేసి 

ఆవాలు చిటపట అనగానే రెండు వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి అందులో వేసి

కరివేపాకు వేసి పచ్చడిలో కలపండి. ఈ పచ్చడి చపాతికీ,

వేడి వేడి అన్నానికి కలుపుకొని తిని చూడండి! ఆహా...ఏమి రుచీ