Friday, November 03, 2006

సందీప్

కావలసినవి::

1/2..... గ్లాసు పుల్లటి పెరుగు
1....... గ్లాసు మైదాపిండి
2....... గ్లాసుల నెయ్యి
2....... గ్లాసుల పంచదార


చేసే విధానము::

పుల్లటి పెరుగు మైదాపిండి లో పోసి పూరీ పిండిలా చేయాలి.( నీళ్ళు తగలకూడదు )

ఎంత నెయ్యి పడితే అంతా వేసి ముద్దలా చేయాలి .

1 గంట నానబెట్టి బాగా మర్ధించి దళసరి చపాతీలు వత్తాలి.

చపాతి వత్తగానే పైన నెయ్యి రాసి మడిచి మళ్ళా వత్తాలి అలా 4 5 సార్లు వత్తాక

చపాతి మీద గుండ్రని మూత లాంటి దానితో అదిమి బిళ్ళలుగా కట్ చేయాలి.

నెయ్యి కాచిఒక్కో బిళ్ళనీ గోల్డు కలర్ వచ్చెలా వేయించి తీసి ఓ పెద్ద పళ్ళెం లో పెట్టాలి.

చక్కర లో నీళ్ళు పోసి ముదరుపాకం పట్టి ఆ పాకాన్నిఒక్కో బిళ్ళమీద చెంచాతో వెయ్యాలి.

అరగంట ఆరిన తర్వాత పాకం పొరల్లోకి పోయి యమ రుచిగా ఉంటాయి...మీరు రెడినా...

No comments: