Thursday, November 29, 2007

మైసూర్ మసాలా దోసె



!! కావలసినవి !!

మినప్పప్పు....... 2 కప్పులు
శనగపప్పు......... 2 కప్పులు
బియ్యం ............ 1/4 కప్ప్పు
మెంతులు......... 1/4 టీస్పూన్
ఉప్పు తగినంత
ఎండుమిర్చి తగినన్ని

!! మసాలా దినుసులు !!

పొటాటో........... 1/2కిలో
పసుపు............ 1/4 టీస్పూన్
ఉడికించిన బఠాణీలు............. 1/2 కప్పు
పచ్చిమిర్చి.................. 3
ఆవాలు........................ 1/4 టీస్పూన్
మినప్ప్పప్పు.................. 1 టీస్పూన్
శనగపప్పు ...................... 1 టీస్పూన్
కరివేపాకు ...................... 1 రెబ్బ
నూనె ............................ 2 టీ స్పూన్స్
అల్లం చిన్న ముక్క


!! చేసే విధానం !!

పొటాటో ముందే వుడికించి పొట్టుతీసి చేత్తో వాటిని చిన్న చిన్న ముక్కలుగా చిదుముకోవాలి.
బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి కొద్దిగా వేపి సన్నగా
తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు తరిగిన
పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి కొద్దిగా వేపి బఠానీలు,తగినంత
ఉప్పు వేసి పొటాటోను అందులో కలిపి బాగా కలియబెట్టి ఈ పొటాటో కూరను తయార్ చేసుకోవాలి.

బియ్యం,మినపప్పు, మెంతులు,విడివిడిగా కనీసం 3 గంటలు నానబెట్టి తరువాత మెత్తగా రుబ్బి,
తగినంత ఉప్పు, ఎండుమిరపకాయలు కలిపి మళ్ళీ రుబ్బుకోవాలి. పిండిని బాగా
కలియబెట్టి గరిటజారుగా చేసుకుని వేడి పెనంపై కొంచెం నూనె వేసి దోసెలు చేసుకుని
ఈ మసాల కూరని దోసలో వుంచి సర్వే చేస్తే వావ్ భలే రుచి :)

No comments: