Thursday, November 29, 2007

పుల్లట్టు



!! కావలసినవి !!

బియ్యపు పిండి 250 గ్రాం
మైదా 100 గ్రాం
గడ్డపెరుగు 100 గ్రాం
జీలకర్ర 1 టీ స్పూన్
పచ్చిమిరపకాయలు 3
ఉల్లిపాయలు 1
వేరుశనగపప్పు 50 గ్రాం
నెయ్యి అర కప్పు
కరివేపాకు 2 రెబ్బలు
కొత్తిమిర 2 టీ స్పూన్స్

!! తయారు చేసే విధానం !!


బాగా చిక్కగా ఉన్న పెరుగు బాగా చిలికి అందులో కొన్ని నీళ్ళు,కొద్దిగా ఉప్పు ,సన్నగా తరిగిన ఆనియన్స్
ముక్కలు,పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, వేరుశనగపప్పు, బియ్యపు పిండి,
మైదా వేసి ఉండలు లేకుండా మృదువుగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని సుమారు
నాలుగైదు గంటలపాటు పులవనిచ్చి ఆ తరువాతే అట్టు పోసుకోవాలి. అట్ల పెనం మీద
కాని గుంటల పెనం మీద కాని దీనిని కావలసిన సైజులో పోసుకొని నెయ్యితో
కాల్చుకోవాలి.
పిండి ఎంత పుల్లగా ఉంటే అట్లు అంత బాగుంటాయి

No comments: