Sunday, November 05, 2006

బియ్యపు చెక్కలు + నిప్పట్లు
















కావలసినవి::

బియ్యపు పిండి..... 1/2 కేజి
జీలకర్ర............. 1/2 స్పూను
కారం పొడి......... 1/2 స్పూను
వేరుశనక్కాయలు......1 చిన్న గ్లాసు
నువ్వులు...........2 టేబల్ స్పూన్స్
ఉప్పు తగినంత..............
కరిగించిన నెయ్యి లేదాడాల్డ....50 గ్రాం
.

చేసేవిధానము::

ముందుగా పిండిలో ఉప్పు,కారం పొడి( ఎండుమెరపకాయలు ఇంట్లో గ్రైండర్ లో తిప్పితే బాగుంటుంది ) , జీలకర్ర,కరిగించిననెయ్యి,వేరుశనక్కాయలు(పల్లీలు) గ్రైండర్లో ఒక్కతిప్పు తిప్పి అదికూడపిండిలో వేసి బాగా కలిపి ఒక గ్లాసు మరిగించిన నీరు పోసిమొత్తం బాగ కలిపి మూత పెట్టి ఉంచాలి. తర్వాత పిండిని బాగ కలిపి చిన్న చిన్నఉండలుగా చేసుకొని పాలిథిన్ కవరుపై నూనె రాసి పల్చగా వత్తి వేడి వేడి నూనెలోఎర్రగా వేయించిబంగారు రంగు వచ్చేవరకు వేయించి తేసి ప్లేటులో ఉంచండి.
చల్లారాక టైట్ గా ఉన్న డబ్బాలో వేసి ఉంచండి.ఇవి చాల రోజులు నిలవ ఉంటాయి...ఈ రెసిపి మీకు నచ్చింటే ఒక్క కామెంట్....ఆహా...ఏమిరుచీ.....

No comments: