Wednesday, August 22, 2007

జాంగ్రీ

!!! కావలసినవి !!!

మినప్పప్పు 250 gm
బియ్యం గుప్పెడు
పంచదార 1/2 kg
మిఠాయిరంగు చిటికెడు
నెయ్యి లేక నూనె వేయించడానికి

!!! చేసే విధానం !!!

మినప్పప్పును శుభ్రం చేసి బియ్యం కలిపి నీళ్ళు పోసి 4 గంటలు నాననివ్వాలి.
తర్వాత ఈ పప్పును కాటుకలాగా మెత్తగా రుబ్బుకోవాలి.
పంచదారలో కప్పుడు నీళ్ళు పోసి జిగురుపాకం చేసి మిఠాయిరంగు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఒక మందపాటి గుడ్డకు రంధ్రం చేసి ,అంచులు కుట్టి, అందులో ఈ పిండి వేసి నాలుగుమూలలు కలిపి
మూటలాగా పట్టుకుని వేడి నూనెలో చుట్టలుగా వత్తుకోవాలి.
ఎర్రగా కాలినతర్వాత తీసి పాకంలో వేయాలి.
అలా అన్ని చేసుకుని రెండుగంటలు పాకంలో నాననిస్తే, జాంగ్రీలు గుల్ల విచ్చి పాకం బాగా
పీలుచుకుని మృదువుగా ఉంటాయి.
జాంగ్రీ ,లేదా జిలేబీలు ,చేయడానికి ప్లాస్టిక్ బాటిల్ వంటిది దొరుకుతాయి.
అవి కూడా ఉపయోగించుకోవచ్చు...మీరూ....రెడినా ? :)
shadruchulu.blogspot.com ....సేకరించినది
!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!*!

పెసర బొబ్బట్లు




కావలసినవి::

పెసరపప్పు........అర కేజీ
చక్కెర...........అర కేజీ
రవ్వ............200gm
మైదా...........ముప్పావు కేజీ
యాలకుల పొడి.....1 టేబల్‌స్పూన్
నెయ్యి లేదా నూనె...పావు కేజీ
పచ్చకర్పూరం......1/3 టేబల్‌స్పూన్

చేసే విధానం::

పెసరపప్పును బాగా కడిగి ఒక గంట సేపు నీటిలో నాననివ్వాలి.
నానిన పప్పును మెత్తగా రుబ్బుకోవాలి.

రుబ్బిన పప్పును ఆవిరిపై ఉడికించుకోవాలి.

ఉడికిన ముద్దను చల్లార్చి చిదిమి పొడి చేసుకుని చక్కరలో కొంచెం నీళ్ళు పోసి తీగ
పాకం పట్టి పెసరపప్పు పిండిని పకంలో చేర్చాలి.

ఉడుకుతుండగా అందులో కొంచెం నెయ్యి,యాలకుల పొడి పచ్చకర్పూరం వేసి గట్టి పడేవరకు వుంచాలి.
ఆ తర్వత దించేయాలి.

చల్లారాక ఈ పూర్ణాన్ని చిన్న చిన్న వుండలు చేసుకుని వుంచుకోవాలి.

మైదా, రవ్వ కలిపి నీళ్ళు పోసి పూరిపిండిలా తడిపి గంట నాననివ్వాలి.

ఒక పాలిధిన్ పేపర్‌కు నూనె రాసి పూరిపిండిని చిన్న వుండలుగా చేసి
వెడల్పుగా వత్తుకుని మధ్యలో పూర్ణం ముద్దను పెట్టి అంచులు మూసేసి
దాన్ని చపాతీలా వత్తుకుని వేడి పెనంపై వేయండి వేస్తూ
రెండువైపులానెయ్యి లేక నునె రాస్తూ కాల్చుకోవాలి.
వేడి వేడి గా తింటే...ఆ..హా..ఏమి..రుచీ...ఆహా..
పండగలకు మాంచి పూర్ణం బొబ్బట్లు ....

చలిమిడి

కావలసినవి::

బియ్యం.....................ఒక కప్పు
బెల్లం........................అర కప్పు
పచ్చికొబ్బరి..............పావు చిప్ప
గసగసాలు................రెండు చెంచాలు
యాలకులు...............3
నెయ్యి......................4 టేబల్‌స్పూన్స్

చేసే విధానం::

ఒక రోజు ముందు బియ్యం కడిగి నానబెట్టుకోవాలి.
బియ్యం జల్లెడలో పోసి నీళ్ళంతా వడకట్టి
గ్రైండర్లో పొడి చేసుకుని జల్లించి తడి ఆరిపోకుండా దగ్గరగా నొక్కి పెట్టుకోవాలి.

పిండి ఆరిపోకూడదు.తడిగుడ్డ గట్టిగా పిండి ఆ పిండిపై కప్పి ఉంచండి
అప్పుడు తడి ఆరిపోకుండగా ఉంటుంది.

కొబ్బరికాయ సన్నటి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
మూకుడు లో నెయ్యి వేడి చేసి కొబ్బరిముక్కలు ఎర్రగా వేయించి పక్కన ఉంచండి.
అందులోనే గసగసాలు కూడా వేయించి పక్కన ఉంచండి.
యాలకులు పొడి చేసి పెట్టుకోవాలి.
బెల్లం తురిమి,పావు కప్పు నీరు పోసి ఉడికించి, మరీ లేత కాకుండా మరీ ముదురు పాకం కాకుండా
చేసి యాలకుల పొడి, నెయ్యి కలిపి క్రిందకు దించి కొద్దికొద్దిగా బియ్యం పిండి వేస్తూ
గరిటతో ఉండలు లేకుండా కలుపుతూ చివరగా కొబ్బరిముక్క్లలు,గసగసాలు కూడా
కలిపి మూతపెట్టి ఉంచాలి. చలిమిడి రెడీ.....మరి మీరు తయారా ..మీకు నచ్చుంటే నాకో మెస్సేజి పెట్టండి :)

డబల్ కా మీటా


!!! కావలసినవి !!!

బ్రెడ్..................10 స్లైసులు
చక్కెర................150 gm
పాలు.................1/2 lit
యాలకుల పొడి......2tsp
కుంకుమపువ్వు చిటికెడు
బాదాం...............5
జీడిపప్పు............6
కిస్‍మిస్..............5
నెయ్యి బ్రెడ్ స్లైసులు వేయించడానికి

!!! చేసే విధానం !!!

ముందుగా బ్రెడ్ స్లైసులను నాలుగు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.

వాటిని నెయ్యిలో ఎర్రగా వేయించి ఉంచుకోండి
పాలు ,చక్కెర, కుంకుమపువ్వు కలిపిమరిగించి చిక్కగా అయ్యేవరకు ఉంచాలి.

బ్రెడ్ ముక్కలను ఒక పెద్ద పళ్ళెంలో పరిచి వాటిపై ఈ వేడి పాలు సమనంగా పోయాలి.
బ్రెడ్ ముక్కలు పాలన్నీ పీల్చుకుంటాయి.

పైన సన్నగా తరిగిన బాదాం, జీడిపపు, కిస్‍మిస్ చల్లాలి.

ఇది వేడిగా కాని చల్లగా కాని వడ్డించాలి.మరి మీరూ మొదలెట్టండి ....ఆ..హా..ఏమి..రుచీ...
~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~

Saturday, August 18, 2007

పానీ పూరీ ---paanee poorii

paanee pUrii
పూరి చేసే ఐటమ్స్ :::

మైద.............1 కప్పు
రవ..............1/4 కప్పు
కుక్కింగ్ సోడ....3 చిటికెలు
ఉద్దిపప్పు........2 టెబల్ స్పూన్స్
రుచికి తగినంత ఉప్పు.

పూరి చేసే విధానం !!

ఉద్దిపప్పు దోరగా వేయించి పౌడర్ చేసి వుంచండి .
రవ , మైదా , సోడా , ఉద్దిపొడి , ఉప్పు. అన్నీ చల్లటి నీళ్ళుపోసి గట్టిగా పూరీ పిండిలా కలిపి , తడి ఆరకుండగా తడి గుడ్డవేసి 2 గంటలసేపు నానపెట్టాలి .
తరువాత చిన్న చిన్న పూరీలుగా చేసి నూనెలో వేయించు పెట్టుకొండి .

పానీ చేసే విధానం !!!

చింతపండు రసంలో జిలకర వేయించి పౌడర్ చేసి పానీలో కలపండి .
దానితో పాటు పుదిన , కొతమిర , గ్రీన్ చిల్లీ , అన్నీకలిపి గ్రైండ్ చేసి పానీలో కలపంది .

ఫోటాటో కూర:
కావలసినవి !!!

పొటాటో 1/2 కిలో
సన్నగా తరిగిన 2 ఆనియన్స్
పచ్చ బటాని , కార్న్ , 2 పిడికిళ్ళు .

cheese 2 స్పూన్స్
గరం మసాల పౌడర్ 3స్పూన్స్

కొత్తమిర , ఉప్పు , పసుపు . తగినంత.

కూర చేసే విధానం !!!

పొటాటో కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వచ్చాక దింపి చల్లారిన తరువాత పొట్టుతీసి మెత్తగా చెసి వుంచుకోవాలి .

తరువాత పాన్ లో నూనె వేసి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి దోరగా వేయించి , అందులో గరం మసాల , ఉప్పు , పసుపు , రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ , వేసి పచ్చిబటానీలు , కార్న్ అన్నీ అందులో వేసి బాగా వుడికించి కాస్త బట్టర్ వేసి సన్నటి సెగపై 5 నిముషా అలాగే వుంచి కోత్తమీర వేసి ష్టావ్ ఆఫ్ చేయండి.

పూరి గిన్నెలా hole చేసి అందులో పొటాటోకూర పెట్టి దానిపైపానీ వేసి , పచ్చి ఆనియన్,వేసి తింటే ........వావ్....యమ రుచి :)
మీకు కావాలంటే సన్నగా తరిగిన ఆనియన్స్ . కుకుంబర్ , కారెట్ , టోమాటో slices చేసి , plate లో decorate చేసి పూరితో పాటు ఇవీ తింటే మరీ మరీ రుచి .:)
మరి మీరు రెడినా ???

Sunday, July 29, 2007

ఆలూ పరాఠా.... Alu parota

చేసే విధానం::

బంగాళదుంపలు-------------- 3
గోధుమపిండి----------------- 3 cups
మైదా----------------------- 1 cup
జీలకర్ర---------------------- 1 tsp
కారంపొడి------------------- 1 tsp
గరంమసాలా---------------- 1/2 tsp
కొత్తిమిర-------------------- 2 tsp
కరివేపాకు------------------ 1 tsp
ఉప్ప----------------------- 1/2 tsp
నూనె-----------------------50 ml
పెరుగు--------------------- 3 tbsp
పసుపు-------------------- 1/4 tsp

చేసే విధానం::

పొటాటో మెత్తగా ఉడికించి పొట్టు తీసి పొడి పొడిగా చేసుకోవాలి.
గోధుమ పిండి లో మైదా,కారంపొడి,జీలకర్ర,గరం మసాలా,
సన్నగా తరిగిన కరివేపాకు,కొత్తిమిర,పెరుగు ,
పొటాటో పొడి ,పసుపువేసి బాగా కలియబెట్టి
తగిన నీరు పోసి చపాతీ పిండిలా కలిపి అరగంట పక్కనపెట్తుకోవాలి.

తర్వాత నిమ్మకాయంత ఉండలు చేసుకొని
చపాతీల్లా వత్తి వేడి పెనంపై నూనెతో రెండు వైపులా ఎర్రగా కాలుచుకోవాలి.
ఘుమ ఘుమ లాడే వేడి వేడి పరోటా తయార్
మీరు చేసి చూడండీ..మేరే అంటారు..ఆ..హా..ఏమి..రుచీ

Sunday, June 10, 2007

పాకం గారెలు

కావలసినవి

పొట్టుమినపప్పు..................50గ్రా
బెల్లం ............................1 Kg
నెయ్యి....................50 గ్రా
యాలకులు.....................5
రిపైండ్ ఆయిల్ తగినంత
ఉప్పు తగినంత

తయార్ చేసే విధం

పొట్టుమినపప్పు నాలుగుగంటలపాటు నీళ్ళల్లో నానబెట్టి
పొట్టువచ్చేవరకుచేతితో రుద్ది నీళ్ళతో కడగాలి .

ఆ తరువాత ఈ పప్పును గ్రైండర్ లో మరీమెత్తగాకాకుండ
గ్రైండ్ చేసి తరిగిన బెల్లం వేసి ఒక గ్లాస్ నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టి
లేతపాకం వచ్చేవరకువేడి చేయాలి .

ఇప్పుడు ఒక మూకుడులో నూనెపోసి వేడికాగానే
మినపప్పు ముద్దను తడి అరచేతిపైన లేదా అరటాకుపైన గాని
అద్ది నూనెలో వేయాలి .
వాటిని ఎర్రగా వేయించి , తీగపాకంలో ముంచి బాగా నాన నివ్వండి .
నోరూరించే పాకం గారెలు రెడి ...మరి మీరూ రెడినా....