Sunday, June 10, 2007

పాలతో మైసూర్ పాక్

కావలసినవి

పంచదార 150 gm
శనగపిండి 150 gm
నెయ్యి 150 gm
పాలు అర కప్పు


చేసే విధానం

పంచదార శనగపిండి, పాలని ఒక గిన్నెలో ఉండలు లేకుండా కలపాలి. అందులో అర
కప్పు నీళ్ళు పోసి కలిపి పొయ్యి మీద దళసరి గిన్నె పెట్టి అందులో ఈ మిశ్రమాన్ని పోసి
అడుగంటకుండా సన్నని సెగ మీద కలియబెడుతు ఉండాలి. మధ్య మధ్యలో కరిగించిన
నెయ్యి కొద్ది కొద్దిగా పోస్తూకలియబెడుతూ ఉండాలి.బాగా దగ్గర పడి నెయ్యి పూర్తిగా
అయిపోయేవరకు ఉంచి దానిని ఒక నెయ్యి రాసిన పళ్ళెంలో పోసి బాగా నెరపి
కావల్సిన సైజులో కోసుకోవాలి. ఇది కూడా మృదువుగా ఉంటుంది.
షడ్రుచులు..బ్లాగునుండి సేకరించినది

No comments: