Sunday, June 10, 2007

కాజూ మైసూర్ పాక్

కావలసినవి

శనగపిండి 150 gm
పంచదార 200 gm
నెయ్యి 150 gm
జీడిపప్పు 150 gm


చేసే విధానం

ముందుగా జీడిపప్పును బరకగా పొడి చేసుకోవాలి. దానిని శనగపిండిలో కలపాలి.
పొయ్యిమీద దళసరి గిన్నెగాని మూకుడుగానీ పెట్టి పంచదారలో అర కప్పు నీరు
పోసి లేత పాకం వచ్చేవరకు మరిగించి జీడిపప్పు, శనగపిండి మిశ్రమాన్ని వేసి
ఉండలు లేకుండా కలపాలి. అల కలుపుతూ మధ్య మధ్యలో కరిగించిన నెయ్యిని
గరిటతో పోస్తూ కలుపుతూ ఉండాలి. బాగా దగ్గరపడి శనగపిండి మిశ్రమం గుల్ల
విచ్చి బుస బుస పొంగుతుంది. అప్పుదు దింపి నెయ్యి రాసిన పళ్ళెంలో పోసి
సమానంగా అయ్యేలా నెరిపి కావల్సిన సైజులో ముక్కలుగా కోసుకోవాలి.
ఇది మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది

మీరూ చేసేందుకు తయార్ కాండి :)
shadruchulu.blogspot.com....సేకరించినది

No comments: